in ,

ముమ్మరంగా ఏయిమ్ సభ్యత్వ నమోదు

అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలంలో అంబేద్కర్ ఇండియా మిషన్(AIM) జిల్లా కో కన్వీనర్ సరమండ వీరబాబు ఆధ్వర్యంలో ముమ్మరంగా సభ్యత్వం నమోదు చేస్తున్నారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఏయిమ్ వ్యవస్థాపకులు పీవి సునీల్ కుమార్ ఆదేశాల మేరకు సభ్యత్వం నమోదు చేస్తున్నామని,ప్రత్యేక దళిత పంచాయితీలు సాధించడమే  ఏయిమ్ లక్ష్యమని, అవి సాధించేవరకు పోరాడుతుందన్నారు. అలాగే ప్రత్యేక దళిత పంచాయతీల వలన మాత్రమే దళిత వాడలు అభివృద్ధి చెందుతాయన్నారు. ఈకార్యక్రమలో మండల అధ్యక్షులు చిట్ల అప్పారావు, కార్యదర్శి బి. అప్పారావు,ఎస్.రాజు తదితరులు పాల్గొన్నారు.

Written by N.Chiranjeevi

ఆరోగ్య సురక్ష పై సానుకూలంగా స్పందించిన లోక్ సత్తా పార్టీ అధినేత

గణేకల్లు సబ్ స్టేషన్ ముందు విద్యుత్ కోతలకు నిరసనగా రైతుల ధర్నా.