కొవ్వూరు: రసాయన ఎరువులు పురుగుమందులు లేకుండా సహజ సిద్ధంగా పండించిన కూరగాయలు ఆరోగ్యానికి మేలు చేస్తాయని రైతులు అన్నారు. ప్రకృతి వ్యవసాయ పద్దతులలో పండించిన కూరగాయలు ప్రతీ సోమవారం కొవ్వూరు ఆర్డిఓ ఆఫీస్ బయట లభ్యం అవుతున్నాయి. రసాయన ఎరువులు పురుగు మందుల ఉపయోగించడం వలన వస్తున్న అనేక జీవన శైలి వ్యాధులకు, క్యాన్సర్ లాంటి అనారోగ్యాల బారిన పడకుండా తప్పించుకునే అవకాశం ఉంది.