కేరళ రాష్ట్రంలో ఈ వైరస్ ఆరుగురికి సోకగా, అందులో ఇద్దరు వ్యక్తులు మరణించారు. ప్రపంచవ్యాప్తంగా ఈ వైరస్ సోకిన 14 మంది మరణించారు. కొవిడ్ -19 ఇన్ఫెక్షన్తో పోలిస్తే నిపా వైరస్ సంక్రమణ కేసుల్లో మరణాల రేటు చాలా ఎక్కువగా ఉందని, మరణాల రేటు 40 నుంచి 70 శాతం మధ్య ఉందని, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR) డైరెక్టర్ జనరల్ రాజీవ్ బహ్ల్ హెచ్చరించారు.