భద్రాచలం రామాలయంలో అన్నదానం నిమిత్తం భక్తులు విరాళాలు ఇస్తుంటారు. కొంత మంది నేరుగా వచ్చిస మర్పిస్తుండగా ఇంకొందరు ఆన్లైన్ లో తమకు తోచినంత అందిస్తున్నారు.ఎలక్ట్రానిక్ హుండీని గురువారం ప్రారంభించినట్లు ఈఓ రమాదేవి తెలిపారు.ఇందుకు ఎస్బీఐ సహకారం అందిస్తుందని ఆ బ్యాంకు చీఫ్ నేజర్ ఆచారితెలిపారు.రామాలయానికి తాజాగా సంబంధించిన ప్రత్యేక డిజిటల్ స్టిక్కర్ను తయారు చేయించారు. స్మార్ట్ ఫోన్ స్కాన్ చేసి ఫోన్,గూగుల్ పే తరహాలో ఎవరైనాఎంతైనా విరాళం ఇవ్వవచ్చు.హుండీలో భక్తులు కానుకలు వేస్తుంటారు.ఇలా ఎవరు ఎంత అందించారో తెలియదు.అదే తరహాలో ఇహుండీలోను దాతలు తెలియనప్పటికీ బ్యాంకులో నేరుగా రామయ్య ఖాతాకు జమవుతాయి.ప్రస్తుతం బ్యాంకు వద్ద రెండు స్కానర్లను ఏర్పాటు చేయగా రామాలయం వద్ద మరో మూడు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.నగదు రహిత లావాదేవీలకు ఇదో చక్కని మార్గంగా మారింది.
[zombify_post]

