వైభవంగా కొత్తమ్మతల్లి జాతర ఉత్సవాలు
ప్రారంభం పట్టువస్త్రాలు సమర్పించిన కింజరాపు కుటుంబీకులు అమ్మవారి జంగిడి ఊరేగింపు * కొత్తమ్మతల్లిని దర్శించుకున్న వైసీపీ, టీడీపీ నేతలు * తరలివచ్చిన భక్తజనం భక్తుల పాలిట కల్పవల్లి కోటబొమ్మాళి కొత్తమ్మతల్లి జాతర ఉత్స వాలు మంగళవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభ మయ్యాయి. ఈ ఉత్సవాలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు, ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అలాగే టెక్కలి నియోజకవర్గ సమ స్వయకర్త దువ్వాడ వాణి, కేంద్ర మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నాయకులు కిల్లి కృపారాణి, కళింగ కార్పొరేషన్ చైర్మన్ పేరాడ తిలక్లు కొత్తమ్మ తల్లిని దర్శించుకున్నారు. దేవదాయ శాఖ కార్య నిర్వాహణాధికారి వాకచర్ల రాధాక్రిష్ణ, ఆలయ ట్రస్టు బోర్డు చైర్మెన్ బోయిన మాధవి కృష్ణారావులు స్వాగతం