.టీడీపీ-జనసేన జాయింట్ యాక్షన్ కమిటీ భేటీ తేదీ ఖరారైంది. ఈ నెల 23న సోమవారం రాజమండ్రిలో టీడీపీ-జనసేన తొలి జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం కానుంది. ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు నారా లోకేశ్ – పవన్ కల్యాణ్ అధ్యక్షతన ఈ కమిటీ సమావేశం కానుంది. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం, ఉద్యమ కార్యాచరణ, తాజా రాజకీయ పరిణామాలు, ఇరు పార్టీల సమన్వయంపై కమిటీ చర్చించనుంది. కమిటీ సభ్యులుగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, సీనియర్ నేతలు యనమల రామకృష్ణుడు, పయ్యావుల కేశవ్, పితాని సత్యనారాయణ, తంగిరాల సౌమ్య నిర్ణయించారు.