కొవ్వూరు: కనకదుర్గమ్మ అమ్మవారు జగన్మోహన్ రెడ్డికి మంచి బుద్ధి ప్రసాదించాలని మాజీ మంత్రి జవహర్ అన్నారు. వాడపల్లిలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏర్పాటు చేసిన అమ్మవారి మండపాన్ని జవహర్ సందర్శించారు. అమ్మవారి చల్లని దయతో చంద్రబాబు నాయుడు జైలు నుండి విడుదల కావాలని కోరుతూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా టిడిపి అధికార ప్రతినిధి బూరుగుపల్లి వీరరాఘవులు, కోడూరీ ప్రసాద్, కరటూరి సతీష్, చావా శ్రీనివాస్, యనమదుల శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు