కొవ్వూరు: చంద్రబాబు నాయుడు అక్రమ కేసుల నుంచి త్వరగా బయటకు రావాలని ఆయన క్షేమంగా ఉండాలని ఆరికిరేవుల గ్రామంలో చావా శ్రీనివాస్, యనమదల శివయ్య ఆధ్వర్యంలో కారాగార బంధన విముక్తి జరగాలని వెంకటేశ్వర స్వామి ఆలయంలో పూజలు చేశారు. శ్రీఘ్రమేవ స్వగృహ నివాస సిద్యర్ధ్యం సమస్త శత్రు పీడ నివాస సిద్యర్ధం రామాంజనేయ నాగవళ్లి దళపూజ నిర్వహించారు. రాజమహేంద్రవరం పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి కె.ఎస్ జవహర్ ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.