in

వాహన మిత్ర డబ్బులు విడుదల చేసిన సీఎం వైఎస్ జగన్

 గురు న్యూస్ విశాఖపట్నం : బ్ర‌తుకు బండి లాగేందుకు ఇబ్బందిప‌డుతూ ఆటో, టాక్సీల‌ను న‌డుపుకుంటున్న అన్న‌ద‌మ్ములను‌, అక్క‌చెల్లెమ్మ‌ల‌ను ఆదుకునేందుకు మ‌న ప్ర‌భుత్వంలో వైయ‌స్సార్ వాహ‌న మిత్ర ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాం.అని తెలిపారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు అయన మాట్లాడుతూ స్వంతంగా ఆటో , టాక్సీల‌ను న‌డుపుకుంటున్న వారు వివిధ స‌ర్టిఫికెట్లు పొంద‌డంలో అండ‌గా నిలిచే ఉద్దేశంతో ఈ ప‌థ‌కం ద్వారా వారికి ఏటా రూ.10 వేలు అంద‌జేస్తున్నాం. అని ఆయన అన్నారు. దేవుడి దయ‌తో నేడు వ‌రుసగా ఐదో ఏడాది 2,75,931 మంది డ్రైవర్ అన్న‌ద‌మ్ములు, అక్క‌చెల్లెమ్మ‌ల ఖాతాల్లో రూ.276 కోట్ల‌ను జ‌మ‌చేశాం. ఈ ప‌థ‌కం ద్వారా ఇప్ప‌టివ‌ర‌కూ ఒక్కొక్క‌రికి రూ.50 వేల చొప్పున మొత్తం రూ.1,300 కోట్లను మన ప్ర‌భుత్వం అంద‌జేసింది అని సీఎం జగన్ అన్నారు.

Written by Balakishan

శత శాతం వ్యవసాయ రుణాలు ఇవ్వాల్సిందే

అక్టోబర్ 28న వెంకన్న ఆలయం ముసి వేత