గురు న్యూస్ విశాఖపట్నం : జగన్ ప్రభుత్వం పై అసహనం వ్యక్తం చేశారు ఆశ కార్యకర్తలు. ఈ సందర్బంగా ఆశకార్యకర్త మాట్లాడుతూ తమకి మెడికల్ క్యాంపు అని చెప్పి ఉదయం 6 గంటలకు తీసుకొచ్చారని ఒక ఆశ కార్యకర్త కళ్ళు తిరిగి పడిపోతే అంబులెన్సులో తీసుకెళ్తే ఆమె చనిపోయిందని దానికి ఎవరు బాధ్యత వహిస్తారు అని ఆమె అన్నారు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రోడ్డున పడిందని దానికి ప్రభుత్వం బాధ్యత వహిస్తుందా అని ఆమె ప్రశ్నించారు. ఇక్కడ ఎంత సేపు ఉన్నా మళ్ళీ పీహెచ్సి కి 5 నిమిషాల్లో వెళ్లాలని ఆమె వాపోయారు. గడప గడప ప్రభుత్వ కార్యక్రమం కి మళ్ళీ తీసుకెళ్లడం సరి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.