రాజస్థాన్ జైపూర్లో ఈనెల 23న ‘ఫర్ ఎవర్ స్టార్ ఇండియా’ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫర్ ఎవర్ మిసెస్ ఇండియా (సీజన్-3) పోటీల్లో గాజువాక డ్రైవర్స్కాలనీకి చెందిన బెహరా దివ్య విజేతగా నిలిచారు.దేశవ్యాప్తంగా జీ-1 నేషనల్ లెవెల్కు పది మంది ఎంపికవగా, అందులో దివ్య మొదటి స్థానం సాధించారు. రాష్ట్రం నుంచి 800 మంది పోటీ పడ్డారు. అనవసర శస్త్రచికిత్సలకు వ్యతిరేకంగా, గర్భిణుల సాధారణ ప్రసవాలు చేయించేందుకు ప్రోత్సహిస్తున్న తనకు మిసెస్ ఇండియా టైటిల్ దక్కడం ఆనందంగా ఉందని దివ్య పేర్కొన్నారు.