డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా
జాతీయ పోషకాహార మాసోత్సవాలలో భాగంగా స్త్రీ శిశు సంక్షేమ శాఖ,ఐ.సి.డి.ఎస్ ప్రాజెక్టు ముమ్మిడివరం ఆధ్వర్యంలో, ఐ పోలవరం మండలం లో సి.డి.పి.ఓ ఐ.విమల అధ్యక్షతన ఏర్పాటు చేసిన పోషకాహార ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది, మండల స్థాయిలో గల 70 అంగన్వాడీ కేంద్రముల కార్యకర్తలు వివిధ రకాల పోషక పదార్థాలను తయారు చేసి గర్భిణీ,బాలింతలు,చిన్న పిల్లలకే కాకుండా..ప్రజలందరూ పోషకాహార ప్రాధాన్యతను తెలుసుకొని ఆయా పోషక లోపాన్ని అధిగమించాలంటే స్థానికంగా లభ్యమయ్యే రకాల పోషక పదార్థాలనూ తీసుకోవాలని ప్రదర్శన ద్వారా తెలియ జేశారు,వీటితో పాటుగా చిరు ధాన్యాలు,తృణ ధాన్యాలతో చేసిన వివిధ రకాల ఆహారపదార్థాలు ఆకర్షణీయంగా ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎం.పి.పి,జెడ్.పి.టి.సి,ఎమ్.పి.డి.ఓ.,ఎమ్.ఆర్.ఓ., ఎం.యి.ఓ.1, ఎమ్.యి. ఓ.2, ఐ.సి.డి.యెస్ విస్తరణ అధికారులు సి.హెచ్.నాగలక్ష్మి,జె.మీనాక్షి, ఎమ్.యెస్.కె.లు , అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు పాల్గొన్నారు.
[zombify_post]


