ఆదోనిలోని అంబేద్కర్ నగర్కు చెందిన బోయ రామకృష్ణ (15) పాముకాటుకు గురై ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. దొడ్డనగేరి గ్రామ శివారులో బంధువులను కలవడానికి వెళ్లి మధ్యాహ్నం పాముకాటు వేసినట్లు తెలిపారు. కుటుంబ సభ్యులు నాటు వైద్యుడిని సంప్రదించారు. బాలుడి పరిస్థితి విషమించడంతో స్థానిక ఏరియా ఆస్పత్రికి తీసుకెళ్లారు. వైద్యం ఆలస్యం కావడంతో మృతి చెందినట్లు డ్యూటీ డాక్టర్ విజయ భారతి తెలిపారు.