చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్ట్ నిరసిస్తూ రాజోలు నియోజకవర్గం టిడిపి ఇంచార్జ్ గొల్లపల్లి సూర్యారావు ఆధ్వర్యంలో చేస్తున్న నిరసనకు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు రాజోలు నియోజకవర్గ జనసేన పార్టీ తరుపున మలికిపురం జనసేన పార్టీ మండల అధ్యక్షులు మల్లిపూడి సత్తిబాబు ఆధ్వర్యంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారికి పూలమాలవేసి నివాళులర్పించి అక్కడి నుండి జనసేన నాయకులు శ్రీ రాజేశ్వరరావు బొంతు గారు,మండల అధ్యక్షులు, నాయకులు, వీరమహిళలు, జనసైనికులు కలిసి ర్యాలీగా నడుచుకొని దీక్ష శిబిరం వద్దకు చేరుకొని టిడిపి నాయకులుకు సంఘీభావం తెలియచేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర,జిల్లా కార్యదర్శులు,మండల mpp మండల అధ్యక్షులు, నాయకులు, సర్పంచ్ లు, ఎంపీటీసీలు, గ్రామ శాఖ అధ్యక్షులు, వీరమహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.