in ,

నక్క కనక రాజు మృతదేహం వద్ద నివాళులు అర్పించిన మంత్రి అమర్నాథ్

గురు న్యూస్ విశాఖపట్నం :వైస్సార్సీపీ పార్టీ ఆవిర్భావం నుండి పార్టీకి సేవలు అందిస్తున్న పెందుర్తి మండలం గుర్రంపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడు నక్క కనకరాజు ఆకస్మికంగా మృతి చెందారు. అతని మృతదేహానికి రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆదివారం నివాళులర్పించారు . 2014 నుంచి వైసీపీకి పెందుర్తి మండల అధ్యక్షులుగా చేసి, ప్రస్తుతం జేసీఎస్ మండల కన్వీనర్, కోఆప్షన్ మెంబర్ గా కనకరాజు కొనసాగుతున్నారు. ఈ సందర్భంగా మంత్రి అమర్నాథ్ మాట్లాడుతూ కనకరాజు మరణం పార్టీకి తీరని లోటని, ఆయన అకాల మృతికి చింతిస్తూ, వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నానని ఆయన అన్నారు.కనకరాజు మరణ వార్త తట్టుకునే శక్తిని వారి కుటుంబానికి ఇవ్వాలని ఆ భగవంతుని ప్రార్ధిస్తూ, అతని కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అమర్నాథ్ అన్నారు. ఈ కార్యక్రమం లో పెందుర్తి ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్ రాజ్ తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Balakishan

TS ఎలక్షన్ ప్రచార ధరల పట్టికను విడుదల చేసిన ఎన్నికల కమిషన్

ఆదోనిలో పాముకాటుతో బాలుడు మృతి.