కంటి జబ్బులను మొదటి దశలోనే గుర్తించి వెంటనే డాక్టర్ ను సంప్రదించాలని ఐఎంఏ సెంట్రల్ వర్కింగ్ కమిటీ మెంబర్ డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ కృష్ణమూర్తి, డాక్టర్ ఉషారావు, సూచించారు. ఐఎంఏ లయన్స్ క్లబ్ అవోప సంయుక్తంగా గురువారం ఆదోనిలోని సుజాత కంటి ఆసుపత్రి ఆవరణలో ఉచిత కంటి పరీక్ష శిబిరం నిర్వహించారు. ఇటీవల ఎక్కువగా టీవీలు, ఫోన్లు చూడటం వల్ల కంటి జబ్బుల బారిన పడుతున్నారన్నారు.