in

ప్రజాక్షేత్రంలో టిడిపిని ఎదుర్కోవటం చేతకాకే తప్పుడు కేసులు

ప్రజాక్షేత్రంలోతెలుగుదేశం పార్టీని ఎదుర్కొనలేకే ఎమ్మెల్యే పి ఆర్ కె టిడిపి ఇన్చార్జి జూలకంటి బ్రహ్మారెడ్డి పై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని జిల్లా మైనార్టీ నాయకులు పఠాన్  బాబు ఖాన్ అన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకుని కార్యకర్తలు నాయకులపై తప్పుడు కేసులు బనాయిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారు. తప్పుడు కేసులు పెట్టించి వైసీపీ నాయకులు విలువలు కోల్పోతున్నారు. దమ్ముంటే ప్రజాక్షేత్రంలో తేల్చుకుందాం  అని టిడిపి నాయకులు అన్నారు. బ్రహ్మారెడ్డి నియోజకవర్గంలో తిరిగితే తమ ఓటమి తద్యమని భావించి ఏమి చేయాలో పాలు పోక వైసిపి కుట్రలకు తెరతీసింది. గ్రామంలో కుంకుమ బండ్ల సందర్భంగా జరిగిన వివాదాన్ని తమకు అనుకూలంగా మలుచుకుని టిడిపి కార్యకర్తలపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టి వైసిపి కార్యకర్తలపై సాధారణ కేసులు పెట్టడంతోనే వైసిపి మానసికంగా ఓడిపోయిందని ప్రజలకు గమనించారన్నారు. పిన్నెల్లి సోదరులు టిడిపి కార్యకర్తలపై ఎన్ని కేసులు పెట్టిన అధైర్య పడనని మొక్కవోని పట్టుదలతో టిడిపి జెండా మాచర్లలో ఎగరవేసేంతవరకు తమ పోరాటం కొనసాగిస్తూనే ఉంటారు. వైసిపి సైకో పాలనపై పలనాడు ప్రాంతంలో ప్రతి గ్రామంలో రచ్చబండ వద్ద గుంపులు గుంపులుగా చర్చించుకుంటున్నారు ఎప్పుడు వెళ్ళిపోతుందా సైకో పాలన అని వైసిపి అధినేత ఏమాదిరిగా పోలీసులతో టిడిపి కార్యకర్తలను నాయకులను వేధించి రాక్షసానందం పొందుతున్నారు స్థానిక పిన్నెల్లి సోదరుల సైతం అదే ఆదర్శంగా తీసుకుని తప్పుడు కేసులతో కార్యకర్తలను ఇబ్బందులు పెడుతూ సైకో ఆనందం పొందుతున్నారు మీ ఆనందం మరో నాలుగు నెలల మాత్రమే తరువాత వచ్చేది టిడిపి ప్రభుత్వమే సైకోలకు సహకరించి టిడిపి కార్యకర్తలను వేధింపులు గురి చేసిన వారు ఈ అంతటివారైనా ఉపేక్షించబోమని తగిన సమాధానం చెప్పాల్సి ఉంటుంది

Written by Radhakrishna

రైళ్లలో జనరల్ బోగీలను పెంచండి

9 తేది లోపు చంద్రబాబు బయటకు వస్తారు