పట్టణంలో చెత్తను ఎక్కడబడితే అక్కడ పారవేయకుండా ఇంటి దగ్గరొచ్చే కార్మికులకు ఇవ్వాలని మున్సిపల్ కమిషనర్ రఘునాథ్ రెడ్డి సూచించారు. ఆదివారం ఆదోనిలోని శక్తిగుడి ప్రాంతంలో స్వచ్ఛ ఆదోని కార్యక్రమంపై స్థానికులకు అవగాహన కల్పించారు. వీధులు, రోడ్ల వెంటా, ఖాళీ స్థలాల్లో, పార్కుల్లో అధికంగా మొక్కలు పెంచి పచ్చదనం పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
in Karnool, Latest News