in ,

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

తిరుమల లో భక్తుల రద్దీ పెరిగింది. ఆదివారం సెలవురోజు కావడంతో తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటున్నారు.

తిరుపతిలో ఆదివారం కొనసాగుతున్న భక్తుల రద్దీ

దీంతో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్‌మెంట్లు నిండిపోయాయి. టోకెన్లు లేని భక్తులకు స్వామివారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుందని ఆలయ అధికారులు వెల్లడించారు.

టైమ్ స్లాట్ దర్శనానికి 4 గంటల సమయం, రూ.300 ప్రత్యేక దర్వనానికి కూడా 3 గంటల సమయం పడుతోందని తెలిపారు.

కాగా, శనివారం 74,884 శ్రీవారిని మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

తిరుమలలో నిన్న 32,213 మంది భక్తులు నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.7కోట్లు వచ్చిందని టిటిడి అధికారులు వెల్లడించారు.

Written by Kiran

అనుమతి ఉన్నా లేకున్నా వెనుకడుగు వేసేదే లే : ఐటీ ఉద్యోగులు

ఇసుక తరలిస్తున్న 23 నాటు బళ్ళను పట్టుకున్న రెవిన్యూ అధికారులు