ఆదోనిలో శుక్రవారం విద్యుత్ సరఫరాలేక ఇబ్బంది పడ్డామని ప్రజలు పేర్కొంటున్నారు. గణేష్ నిమజ్జన ఉత్సవం నేపథ్యంలో విద్యుత్ ప్రమాదాలు జరగకుండా అధికారులు విద్యుత్ సరఫరా నిలిపేసి ముందస్తు చర్యలు తీసుకున్నారు. సాయంత్రం ఐదు గంటల తర్వాత విగ్రహాలు తరలింపు ప్రక్రియ మొదలైంది. వీధులన్నీ చీకటిమయమై గణేషుని శోభయాత్ర కనులారా చూడలేకపోయామని కొందరు భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు.