in , , ,

ఘనంగా దండు మైసమ్మ తల్లి బోనాలు

ఘనంగా దండు మైసమ్మ తల్లి బోనాలు

అమ్మవారి నూతన ఆలయం లో ప్రత్యేక పూజలు చేసిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి

సూర్యాపేట:

సూర్యాపేట పరిసర ప్రాంత ప్రజల ఆరాధ్య దైవం, ఆత్మకూర్ ఎస్ మండలం నెమ్మికల్ వద్ద వరంగల్ – సూర్యాపేట రహదారి పై నూతన ఆలయం లో కొలువుదీరిన  దండు మైసమ్మ  తల్లి బోనాలను ఆదివారం ఘనంగా నిర్వహించారు. 

ఈ సందర్భంగా మహిళలు బోనాలు ఎత్తుకుని డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాల మధ్య పురవీధులగుండా ఆలయానికి చేరుకుని అమ్మవారికి మొక్కులు సమర్పించారు. 

సూర్యాపేట శాసన సభ్యులు , రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ దండు మైసమ్మ తల్లి ఆశీస్సులతో ప్రజలందరూ సుభిక్షంగా ఉండి పాడిపంటలతో, సుఖ సంతోషాలతో ఉండాలన్నారు.

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

తెలంగాణ రాష్ట్రానికి ఆదర్శప్రాయులు చాకలి ఐలమ్మ

మాజీ ఎమ్మెల్యే ఈశ్వరి ఆధ్వర్యంలో నిరాహారదీక్ష