విద్యా వ్యవస్థ కు పునాది సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు.జగిత్యాల జిల్లా కేంద్రంలో నిరాహార దీక్ష చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ కాంట్రాక్ట్ ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని పట్టభద్రుల ఎమ్మెల్సీ తాటి పర్తి జీవన్ రెడ్డి సందర్శించి, సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో విద్యార్థులు, నిరుద్యోగులకు పాటు..కాంట్రాక్ట్,ఔట్ సోర్సింగ్,ఉద్యోగులు, అన్నివర్గాల ప్రజలు ఉద్యమించారన్నారు.
రాష్ట్రం ఏర్పడితే ఉన్న ఉద్యోగాలతోపాటు మరిన్ని ఉద్యోగాలు వస్తానని ఆశిస్తే నిరాశే ఎదురైందని పేర్కొన్నారు.
రాష్ట్రం ఏర్పడి పదేళ్లు గడుస్తున్న
సమస్యలు పరిష్కారం కావడం లేదన్నారు.
[zombify_post]


