అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యం 18 బస్తాలు, వాహనం పటుకొన్ని తహశీల్దార్ గారికి తమ కార్యాలయంలో అపగించిన్న గిరిజన సంఘం నాయకులు కొర్ర.త్రినాధ్,ఎస్. గాసీరం దొర, పి.రామదాసు,అమ్మకం దారుడుకి,కొన్నుగొలు డారుడుకి 6A కేసు నమోదు చేసి శిక్షించాలని డిమాండ్ చేయడం జరుగుతుంది,
తహశీల్దార్ ఆర్ వి ఎస్ ఎల్.నర్సమ్మ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది,
ఈ సందర్భంగా కొర్ర త్రినాధ్ మాట్లాడుతూ ఉదయం 7 గంటలకు పెద్ద గూడ ప్రాంతం నుండి AP31TC5545 బోలోర పికప్ వాహనం పై అక్రమంగా తరలిస్తున్నారని సమాచారం అందడంతో వనబసింగి పంచాయితి కోత్తురులో కపు కాసి పటుకోడం జరిగింది,వైసిపి ప్రభుత్వం గత 10 నెలల నుండి రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసిన్న పీడీఎస్ బియ్యం ఇవ్వడం లేదు, కేంద్రం నుండి ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం ప్రతి నెల అరకొరగా అందుతుంది, డిపోలో సగం మంది లబ్ధిదారలకు అందడం లేదు, ఇలాంటి సమయంలో బ్లాక్ మార్కెట్లో బస్తాలు బస్తాలు జీసిసి అధికారుల సహకారంతో అక్రమంగా తరలిస్తు అమ్ముకోవడం జరుగుతుంది, ఎన్ని సార్లు సంబంధిత అధికారులకు విన్నవించినా చర్యలు శూన్యం,
అందుకే ఇప్పటికైన అదికారులు స్పందించి లబ్ధిదారులకు అందవలసిన పీడీఎస్ బియ్యం సక్రమంగా అందించాలని, అమ్మకం దారుడు,కొనుగోలు దారుడు వాహనం పై, కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం,ఇందులో సీపీఎం వైస్ ఎంపిపి పి. సత్యనారాయణ, జి.నారాయణ, ఎంఎం శ్రీను,వి. లైకోన్, వర్తక సంఘం అధ్యక్షులు ఎస్.ప్రసన కుమార్,ఎస్.ఈశ్వరి తదితరులు పాల్గొన్నారు,