- అనకాపల్లి: అధిక ధరలు తగ్గించాలని, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, కరెంటు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై సిపిఎం సమర భేరి కార్యక్రమం సోమవారం చేపట్టారు . అనకాపల్లి ఆర్డీఒ కార్యాలయాల వద్ద ధర్నాలో సిపిఎం జిల్లా కార్యదర్శితో సహా పలువురు నాయకులు మెడలో కూరగాయల దండలు, నెత్తిన గ్యాస్ బండలు పెట్టుకొని వినూత్నంగా నిరసన తెలియజేశారు. తక్షణమే ధరలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రజా పోరాటాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు.
[zombify_post]


