- ప
పాడేరు సెప్టెంబర్ 23: అల్లూరి సీతారామరాజు జిల్లాలో శిక్షణ పొందుతున్న ఎంపీడీవోలు కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. 2022 బ్యాచ్ కు చెందిన 34 మంది శనివారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ను కలిశారు. మరో వారం రోజుల్లో శిక్షణ పూర్తి చేసుకుని విధుల్లో చేరుతామన్నారు. అనంతరం అల్లూరి సీతారామరాజు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.