in , ,

రేపు కిరండూల్‌ పాసింజర్‌ రద్దు

తాటిచెట్లపాలెం: వాల్తేర్‌ డివిజన్‌, గోరాపుర్‌-అరకు-సిమిలిగుడ స్టేషన్‌ల పరిధిలో చేపట్టిన భద్రతాపరమైన ఆధునికీకరణ పనుల నిమిత్తం విశాఖ-కిరండూల్‌-విశాఖ పాసింజర్‌ స్పెషల్‌ రైళ్లు రద్దు చేస్తున్నట్లు వాల్తేర్‌ డిఏవిజన్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఏకే త్రిపాఠి తెలిపారు. ఆదివారం విశాఖలో బయల్దేరాల్సిన విశాఖ-కిరండూల్‌ (08551) పాసింజర్‌ స్పెషల్‌ రద్దు చేశారు. తిరుగు ప్రయాణంలో కిరండూల్‌లో 11న బయల్దేరవలసిన కిరండూల్‌-విశాఖ (08552) పాసింజర్‌ స్పెషల్‌ రద్దు చేశామన్నారు.

[zombify_post]

Written by RAJESH POTLA

ఆకస్మాత్తుగా చనిపోయిన యువకుడు.. నెల రోజుల తర్వాత సమాధి తవ్విన వైనం.. షాకింగ్ ఘటన

బాలికపై లైంగిక దాడి కేసులో ముగ్గురు అరెస్టు