in ,

ప్రజాస్వామ్యం కోసం రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలసి పోరాడాలి

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్టు ముమ్మాటికీ కక్ష సాధింపు చర్య అని జనసేన నేతలు అన్నారు. 

  • ★ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జనసేన నాయకులు, పలు నియోజవర్గాల ఇంచార్జ్ లు నారా బ్రాహ్మణిని కలిసి సంఘీభావం తెలిపారు.
  • ★ పార్టీ జిల్లా అధ్యక్షులు కందుల దుర్గేష్ నేతృత్వంలో వచ్చిన ఇంచార్జ్ లు, నేతలు నారా బ్రాహ్మణిని కలిసి తమ మద్దతు ప్రకటించారు. 
  • ★ రాష్ట్రంలో పరిస్థితులు రోజురోజుకూ దిగజారుతున్నాయని…రాక్షస పాలనపై ఉమ్మడం పోరాటం చేయాలని వారు అన్నారు. 
  • *ఈ సందర్భంగా నారా బ్రాహ్మణి మాట్లాడుతూ…*
  • ★ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు ఎన్నడూ, ఎవరూ చూడలేదని అన్నారు. 
  • ★ చంద్రబాబుపై కేసు విషయంలో అన్ని డాక్యుమెంట్లు, రిపోర్టులు తాను పరిశీలించానని…. చంద్రబాబు తప్పు చేసినట్లు చిన్న ఆధారం కూడా ఎక్కడా లేదని అన్నారు. 
  • ★ రాజకీయ కక్ష తప్ప ఈ కేసు మరొకటి కాదని ఆమె అభిప్రాయపడ్డారు. 
  • ★ ఈ స్థాయి విధ్వేష రాజకీయాలు ఎప్పుడూ లేవని బ్రాహ్మణి ఆవేదన వ్యక్తం చేశారు. 
  • ★ రాష్ట్రంలో యువతకు ఉద్యోగాలు లేవని….గంజాయి, డ్రగ్స్ మాత్రమే ఉన్నాయని బ్రాహ్మణి అన్నారు.
  • ★ తెలుగు దేశం, జనసేన.. రెండు పార్టీల నుంచి సమన్వయ కమిటీ ఏర్పాటు పై లోకేష్ చర్చిస్తున్నారని తనను కలిసిన జనసేన నేతలకు ఆమె తెలిపారు. 
  • ★ ప్రజాస్వామ్య పరిరక్షణకు రెండు పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి పోరాడాలన్న బ్రాహ్మణి…..స్వయంగా వచ్చి సంఘీభావం తెలిపిన జనసేన నేతలకు, అండగా నిలబడుతున్న పార్టీ కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. 
  • *మద్దతు తెలిపిన వారిలో ముత్తా శశిధర్, తోట సుధీర్,తుమ్మల రామ స్వామి బాబు,పితాని బాలకృష్ణ, తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్, పోలిశెట్టి చంద్ర శేఖర్, గంటా స్వరూపా రాణీ, బత్తుల బల రామకృష్ణ, వాసిరెడ్డి శివ, మర్రెడ్డి శ్రీనివాస్, వరుపుల తమ్మయ్య
  •  బాబు తదితరులు ఉన్నారు.*

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by Kiran

అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చింది చంద్రబాబు : మహసేన

దుర్గా గణపతి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన నగర మేయర్ దంపతులు