ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి గ్రామంలో టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మహసేన రాజేష్ మీడియా సమావేశంనిర్వహించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై తనదైన స్టైల్ లో విమర్శలు గురిపించారు.
రాష్ట్రంలో సైకో పాలన కొనసాగుతుదని దుయ్యబట్టారు.
చంద్రబాబు నాయుడుకు నిర్మించడం, అభివృద్ధి చేయడంమే తెలుసని, జగన్మోహన్ రెడ్డికి కూల్చివేయడము తెలుసని ఏదేవా చేశారు.
జగన్మోహన్ రెడ్డి పై ఎన్నో కేసులు ఉన్నాయని చంద్రబాబుపై ఒకే ఒక్క తప్పుడు కేసు బనాయించారన్నారు
చంద్రబాబు హయాంలో గృహ నిర్మాణాలు అపార్ట్మెంట్ల రూపంలో కడితే. జగన్మోహన్ రెడ్డి అధికారం చేపట్టాక రంగులు మార్చడం తప్ప చేసిందేమీ లేదని దుయ్యబట్టారు.
స్కిల్ డెవలప్మెంట్ లో దాదాపు 2 లక్షల 14 వేల మందికి ట్రైనింగ్ ఇచ్చి 74 వేల మందికి ఉపాధి కల్పిస్తే.తప్పుడు కేసులు పెట్టారని ధ్వజమెత్తారు.
అన్నా క్యాంటీన్ ద్వారా పేదల ఆకలి తీర్చిన చంద్రబాబును ప్రజలు ఆదరిస్తారని వాటిని కూడా కూల్చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిది అనిమండిపడ్డారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై 38 కేసులు ఉన్నాయని 38 కేసు నెంబర్లు వేసిన కేకులను ఈ సందర్భంగా రాజేష్ కట్ చేసి జగన్మోహన్ రెడ్డి చిత్ర పటానికి తినిపించి నిరసన వ్యక్తం చేశారు….