గురు న్యూస్ విశాఖపట్నం :విశాఖ నగర పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన రవిశంకర్ అయ్యనార్ రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ ని స్థానిక సర్క్యూట్ హౌస్ లో మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం సి .పి రవిశంకర్ అయ్యన్నార్, గుడివాడ అమర్నాథ్ ఇద్దరు కలిసి విశాఖ నగరంలోని శాంతిభద్రతలు, తదితర అంశాలపై చర్చించుకున్నారు. ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ నగరంలో అసాంఘిక శక్తులపై ఉక్కుపాదము మోపాలని కమిషనర్ కి తెలియజేశారు.