in , , ,

చంద్రబాబు అరెస్ట్: ప్రజలే అండగా ఉండాలన్న భువనేశ్వరి… రాష్ట్రపతి , ప్రధానమంత్రి జోక్యం కోరుతూ లేఖ రాసిన ఎంపీ రామ్మోహన్

ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వేచ్ఛ, హక్కుల కోసం చంద్రబాబు నాయుడు పోరాడుతున్నారని, ఆయనకు అందరూ చేయూత అందించాలని ఆయన భార్య నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు అరెస్టు అనంతరం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడారు.

''చంద్రబాబు నాయుడును కాపాడాలని, ఆయనకు మనో ధైర్యం ఇవ్వాలని విజయవాడ కనకదుర్గమ్మను వేడుకున్నాను'' అని ఆమె ఈ సందర్భంగా చెప్పారు.

''చంద్రబాబు చేస్తున్న ఈ పోరాటం మీ అందరి కోసం. మీరంతా చేయిచేయి కలిపి ఈ పోరాటం దిగ్విజయం చేయాలి'' అని ఆమె అన్నారు.

చివర్లో జైహింద్, జై అమరావతి అంటూ ఆమె నినాదాలు చేశారు.

[zombify_post]

Report

What do you think?

Written by RAJESH POTLA

మారుమూల అటవీ గ్రామంలో జ్వరం సర్వే..

ఎంపీపీ చేతుల మీదుగా ప్రారంభించి గ్రామంలో.క్రీడా మైదానం