హైదరాబాద్ : ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్తో మేఘాలయ సీఎం కాన్రాడ్ కె సంగ్మా మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ప్రగతి భవన్ చేరుకున్న సీఎం సంగ్మాను ముఖ్యమంత్రి కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు..
అనంతరం తేనీటి విందు ఆతిథ్యం ఇచ్చారు. కాసేపు ఇరువురు సీఎంలు ఇష్టాగోష్ఠి నిర్వహించారు. సీఎం సంగ్మాను శాలువాతో సీఎం కేసీఆర్ సత్కరించి, మెమొంటో బహుకరించారు. అనంతరం తిరుగు ప్రయాణమైన మేఘాలయ సీఎంకు కేసీఆర్ వీడ్కోలు పలికారు..
[zombify_post]

