విశాఖపట్నం-లింగంపల్లి-విశాఖపట్నం (12805, 12806) మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్, విజయవాడ-విశాఖపట్నం-విజయవాడ (12717, 12718)మధ్య నడిచే రత్నాచల్ ఎక్స్ ప్రెస్, గుంటూరు-రాయగడ-గుంటూరు (17243, 17244) ఎక్స్ ప్రెస్, విశాఖపట్నం-మచిలీపట్నం-విశాఖపట్నం (17219, 17220) మధ్య నడిచే రైళ్లను ఈనెల 3వ తేదీ నుంచి 10వ తేదీ వరకు రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
విశాఖపట్నం-తిరుపతి -విశాఖపట్నం (22708,22707 ) మధ్య నడుస్తున్న డబుల్ డెక్కర్ రైలును సైతం 6వ తేదీ నుంచి 9వ తేదీ వరకు విశాఖపట్నం-సామర్లకోట మధ్య పాక్షికంగా రద్దు చేశారు. ఆయా తేదీల్లో టికెట్లు బుక్ చేసుకున్నవారి టికెట్లు ఆటోమేటిక్ గా రద్దవడంతోపాటు వారి డబ్బులు కూడా రిఫండ్ అవుతాయి.
[zombify_post]

