రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా శ్రేయస్సు కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెదేపాతో పొత్తు ప్రకటించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు.
రాష్ట్ర భవిష్యత్తు, ప్రజా శ్రేయస్సు కోసమే జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెదేపాతో పొత్తు ప్రకటించారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలవలస యశస్వి అన్నారు. శుక్రవారం పాల్నగర్ లోని పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులు, కార్యకర్తలతో ఆమె సమావేశమయ్యారు. పొత్తు ఫలిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి, జనసేన పార్టీ నాయకురాలు పడాల అరుణ, పడాల శరత్, లోకం మాధవి, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
[zombify_post]

