టిడిపి తోనే అభివృద్ధి సాధ్యం
ఎల్కోట మండలం లచ్చంపేటలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి గొంప కృష్ణ ఆధ్వర్యంలో భవిష్యత్తుకు గ్యారెంటీ కార్యక్రమాన్ని గురువారం రాత్రి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టోలో హామీలను ప్రజలకు వివరిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. టిడిపి తోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని అన్నారు. ప్రతి ఒక్కరూ టిడిపి బలోపేతానికి కృషి చేయాలని కోరారు. కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
[zombify_post]

