in ,

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన గురుకుల విద్యార్థులు

అనకాపల్లి జిల్లా గొలుగొండ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల /కళాశాల విద్యార్థులు వివిధ క్రీడా పోటీల్లో రాష్ట్రస్థాయి, జిల్లా స్థాయిలో ప్రతిభ కనబరచారని ప్రిన్సిపాల్ రుత్తల రామకృష్ణ తెలిపారు. ఈ మేరకు నర్సీపట్నం నియోజకవర్గంలో జరిగిన రాష్ట్రస్థాయి ఆటల పోటీలలో  గురుకుల పాఠశాల విద్యార్థులు పాల్గొని ప్రతిభ కనబరిచిన వారిని ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్ 19 కబడ్డీలో నందకిషోర్, త్రో బాల్ లో వెంకట శివ, సిద్దు ,వెయిట్ లిఫ్టింగ్ నుండి కుమారస్వామి జిల్లా స్థాయిలో ప్రతిభ చూపి రాష్ట్రస్థాయికి సెలెక్ట్ అయ్యారని మరియు అండర్-14 నుండి ఠాగూర్, శ్యాం కుమార్ టెన్నికాయిట్ లో జిల్లా స్థాయికి ఎంపికయ్యారని, అలాగే అండర్ 17 విభాగం నుండి పురుషేశ్వర్, సంతోష్  మరియు నాగరాజు వాలీబాల్ జిల్లా స్థాయికి సెలెక్ట్ అయ్యారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ కెవి రమణ, వ్యాయామ ఉపాధ్యాయుడు శ్యాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by N.Chiranjeevi

అరకువాలీ లో అంగన్‌వాడీల రాస్తారోకో.

బెంగుళూరు లో అరుకు కాఫీ