in ,

రామభద్రపురం: ప్రభుత్వ భూములను పేదలకు పంచాలి: ఎంఆర్పీయస్”

మండల పరిధిలో గుర్తించబడిన ఎసైన్డ్, డీపట్టా, ప్రభుత్వ భూములను వెంటనే భూమి లేని పేదలకు, యస్సీ, యస్టీలకు పంపిణీ చేయాలని జిల్లా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అధ్యక్షుడు పెంకి సుధాకర్ మాదిగ డిమాండ్ చేశారు. ఆరికతోటలో బోదంకి రమాబాయి లేండ్ సీలింగ్ చట్టాన్ని అతిక్రమించి వందలాది ఎకరాలను కలిగి ఉన్నారని తెలిపారు. మండలంలో పనిచేసిన రెవెన్యూ యంత్రాంగం అక్రమార్కులకు అండగా నిలిచి కోటీశ్వరులు అయ్యారని ఆరోపించారు.

[zombify_post]

Report

What do you think?

Written by Prasad

ప్రమాదవశాత్తూ జారి పడి మహిళ మృతి”

150 మందికి వైద్య పరీక్షలు#