అల్లూరి సీతారామరాజు జిల్లా ముంచంగిపుట్టు మండలం అసరాడ, వానుగుమ్మ మధ్యలో ఉన్న కల్వర్టు నిర్మాణం చేసిన గుతదారుడు పై చర్యలు తీసుకోవాలని సీపీఎం మండల కమిటీ సభ్యులు కొర్ర శంకర్ రావు డిమాండ్ చేశారు,
ఈ సందర్భంగా శంకర్ రావు మాట్లాడుతూ వనుగుమ్మా పంచాయితి అసరడ నుండి రంగబయలు పంచాయితీ పట్నపడాలపుట్టు వరకు కొత్తగా తారు రోడ్డు 17 కోట్లు రూపాయలుతో నిర్మాణం జరిగిందన్నారు, ఈ రోడ్డు నిర్మాణం భాగంగా వణుగుమ్మ కల్వర్టు నాసిరకంగా నిర్మాణం చేయడంతోనే రెండు రోజుల నుండి బారి వర్షాల కారణంగా ఈ రోజు మధ్యాహ్నం కోటూకోపోయిందని,దానితో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారని రాకపోకలు స్తంభించిపోయిందని తెలిపారు,అందుకు నాసిరకంగా నిర్మాణం చేసిన గుత్తదారుల పై చర్యలు తీసుకోవాలని,వెంటనే కల్వర్టు నిర్మాణం చేపట్టి రాకపోకలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కోరారు,
[zombify_post]


