in ,

భద్రాచలం మాజీ ఎమ్మెల్యే కన్నుమూత.

ఎన్నికల వేళ తెలంగాణలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. భద్రాచలం మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకురాలు కుంజా సత్యవతి కన్నుమూశారు.

ఆదివారం రాత్రి తీవ్ర అస్వస్థతకు గురై కన్నుమూశారు. భద్రాచలంలోని ఆమె నివాసంలో తీవ్రమైన ఛాతీ నొప్పి రావడంతో హాస్పిటల్‌కి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే మృతి చెందారు.

ఆమె మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

కుంజా సత్యవతి మొదట్లో సీపీఎం పార్టీలో ఉండేవారు. ఆ తర్వాత వైఎస్ఆర్ చొరవతో కాంగ్రెస్ పార్టీలో చేరారు.

1991లో భద్రాచలం ఎంపీపీగా ఎన్నికయింది. 2009లో భద్రాచలం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై గెలిచారు. అసెంబ్లీ మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిటీ, ఎస్టీ కమిటీ, ఎంప్లాయిమెంట్ ఇన్ ప్రాస్ట్రక్చర్ స్టాండింగ్ కమిటీలకు సభ్యురాలుగా పనిచేసింది.

వైఎస్ మరణానంతరం జరిగిన పరిణామాల నేపథ్యంలో కొంత కాలం ఆమె కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగారు. ఆ తరువాత వైఎస్ఆర్సీపీలోకి వెళ్లారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ కాంగ్రెస్‌లోకి వెళ్లారు. ప్రస్తుతం ఆమె బీజేపీలో ఉన్నారు…

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

కాంగ్రెస్ మాట – దామోదరం సంజీవయ్య బాట.

నేడు విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో సీఎం జగన్‌ పర్యటన..