in , , ,

బహుజన కులాల ఐక్యతే రాజ్యాధికారానికి మార్గం

  • బహుజన కులాల ఐక్యతే రాజ్యాధికారానికి మార్గం:

  • దేశ రాజకీయ అధికారాన్ని నిర్ణయించేది కచ్చితంగా బీసీలే.

  • బహుజనులు విస్పష్ట సిద్ధాంతం పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తే తప్ప రాజ్యాధికారం సాధ్యం కాదు.

  • కుల సంఘాలు తమ కర్తవ్యాన్ని మరచి మనువాద పార్టీల వద్ద దళారుల పాత్ర పోషిస్తున్నాయి.

ఇండియాలో దేవుడు లేని గ్రామాలు ఉండొచ్చేమో కానీ ఎస్సీ,బీసీలు లేని గ్రామాలు దాదాపు శూన్యం.గ్రామ నిర్మాణంలో, నాగరికత కట్టడంలో ఎస్సీ,బీసీ కులాల పాత్ర అని నిర్వచనం. వ్యవసాయక దేశమైన ఇండియాలో ఈ కులాలు లేకుండా మనుగడ సాగించడం కష్టం. నీళ్లు తోడే తొండం, బొక్కెనలు సమకూర్చి తోలు సంస్కృతికి మాదిగలు ఆద్యులైతే, కమ్మరుల నాగలి, సాలెల వస్త్రాలు, కుమ్మరుల కుండలు, వడ్డెరల గృహ నిర్మాణ సాధనాలు, గొల్ల కురుమల పాడి దేశాన్ని పరిపూర్ణంగా తీర్చిదిద్దినవి. ప్రపంచంలో మరెక్కడ లేని పకృతి పూజ, సంస్కృతి ఎస్సీ ,బీసీలదే. జనాభా రీత్యా చూసుకున్న నూటికి ఎనభై శాతం బీసీ,ఎస్సీ కులాలే. ఆర్థిక వ్యవస్థ, సామాజిక వ్యవస్థ, రాజకీయ వ్యవస్థలో గమనిస్తే ఈ కులాలు ఉత్పత్తి శక్తులుగా ఉన్నప్పటికీ ప్రయోజనాలు పొందే దగ్గర దూరం చేయబడుతున్నాయి.

ఓటు బ్యాంకు దుష్ట 80 శాతం బహుజనులు ఉంటే మైనార్టీ లైన, బ్రాహ్మణాధిపత్య కులాల ఏలుబడిలో మగ్గుతున్నారు. దేశ రాజకీయ అధికారాన్ని నిర్ణయించేది కచ్చితంగా బీసీలే.(ఎస్సీలకు రాజ్యాధికారం లేకపోయినా కొంతమేరకు వాట పొందగలుగుతున్నారు). అయినప్పటికీ నిర్ణయాక శక్తులుగా కాక నిర్వీర్య శక్తులుగా మారుతున్నారు. గతంలో ఎస్సీలు నిర్ణయాక ఓటు బ్యాంకుగా భావించబడినప్పటికీ ఇటీవల చీలిపోయి ఉండడంతో అమ్ముడుపోయే సర్కుగా మిగిలిపోయిన పరిస్థితి నెలకొని ఉన్నది. పైగా బీసీలు, ఎస్సీ తమలో తాము కులవైశ్యమ్యాలతో కలయించుకుంటున్న సంఘటనలు విచ్ఛిన్నతను మరింత పెంచి పోషిస్తున్నాయి.

బీసీలను ఎస్సీలు, ఎస్సీలను బీసీలు శత్రువులుగా భావించుకుంటున్న దాఖలాలు ఉన్నాయి. ఇలాంటి విపరీత పరిస్థితుల నేపథ్యంలో రాజ్యాధికారం ఎలా సాధ్యం ?

ఏ కులానికి ఆ కులం సొంత అస్తిత్వాలు కలిగి ఉంటే తప్పులేదు. మరో బాధిత కులాన్ని ద్వేషిస్తూ, హెచ్చుతగ్గులు పచ్చరిల్లుతున్న తరుణంలో ఎస్సీ, ఎస్టీ,బీసీల రాజ్యాధికారం నినాదం నీటి మీద అలకడం లాంటిదేనా ? కొందరు బీసీలు రాజ్యాధికారం సాధించాలని,కొందరు ఏసీలు సింహాసనం కైవసం చేసుకోవాలని వివిధ రకాల ప్రణాళికలు, కొత్త సిద్ధాంతాలతో మరింత గందరగోళ వాతావరణం సృష్టిస్తున్నారు. ఎస్సీలపైకి బీసీలను, బీసీలపైకి ఎస్సీలను రెచ్చగొడుతూ పబ్బం గడుపుతూ అగ్రకులాల తొత్తులుగా, చెంచాలుగా మారిపోతున్న కాలంలో రాజ్యాధికారం పగటి కలేనా ? రాజ్యాధికారాన్ని అందుకోవాలంటే ఏం చేయాలి ? బహుజన పితామహులు పూలే, పెరియార్, డాక్టర్ అంబేడ్కర్ల దృష్టితో రాజ్యాధికారం ఎలా సాధించబడాలి ? ప్రస్తుత పరిస్థితుల్లో ఏ వ్యూహ ప్రతి వ్యూహాలు , ఎత్తుగడలు రాజ్యాధికారానికి మార్గాన్ని సులభగ్రాహ్యం  చేయగలవు ?

కేవలం మాదిగలు, కేవలం మాలలు అలాగే యాదవ, గౌడ, కాపు, చాకలి, మంగలి కులాలుగా వైయుక్తికంగా రాజ్యాధికారం సాధించగలవా ? పోనీ బీసీలు ఎస్సీలు వేరువేరుగా రాజ్యాని కైవసం చేసుకోగలరా ? రాజ్యాధికార సాధనలో ఈ అనగారిన కులాల్లోని విద్యార్థి, మేధావి, ఉద్యోగుల కర్తవ్యం ఎంత ? ఇలాంటి ప్రశ్నలు ఎన్నో బహుజన ప్రజల్ని, కార్యకర్తల్ని వేధిస్తున్నాయి. అయితే ఇవేమీ సమాధానం లేని ప్రశ్నలు కావు. పైగా ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాల్ని ఇవ్వగలిగినప్పుడే స్పష్టమైన దృక్పథం, తాత్విక నేపథ్యం, సైదాంతిక పట్టుతో బహుజన రాజ్యాధికార సిద్ధాంతాల్లో నెలకొన్న గందరగోళం నశిస్తుంది.

స్పష్టమైన సైద్ధాంతిక నేపథ్యం లేని ఉద్యమాలు విఫలమవ్వడం చరిత్రలో మనం రుచి చూశాం. ఇండియాలోని కుల వ్యవస్థ,దాని వికృత రూపాలు అవగతం చేసుకోక నిర్లక్ష్యంగా వ్యవహరించి కేవలం వర్గ దృక్పథంతో కమ్యూనిస్టు విప్లవ పోరాటాలు వైఫల్యం చెందినది ఇంకా పూర్తిగా గత చరిత్ర కాలేదు.కేవలం హిందుత్వ భావజాలంతో గాయపడిన గొంతులోంచి పెళ్ళు బిగిన ఆర్తనాదాలు కాకికూతలుగా భావించిన హిందుత్వ జాతీయ శక్తులు నీరుగారిపోవడం తప్పదు. ఇది వర్తమానం.

ఈ క్రమంలో బహుజనులు విస్పష్ట సిద్ధాంతం పకడ్బందీ ప్రణాళికలు అమలు చేస్తే తప్ప రాజ్యాధికారం సాధ్యం కాదు. ఇందుకుగాను మొదట ఎస్సీ ,బీసీల్లోని వైరుధ్యాల సమన్వయం సాధించడం అవసరం. ఎస్సీ, బీసీలు, ఎస్సీలను, ఎస్టీలను, బీసీలను బీసీలు వ్యతిరేకించడం గమనించగలం. దీనికి తోడు అగ్నికి ఆజ్యం పోసినట్టు బీసీ ఎస్సీ మేధావులు ఐడెంటిటీ క్రైటీరియాను ముందుకు తెచ్చి వికట్టాహాసం చేస్తున్నారు. ఎవరి ఐడెంటిటీకి ఏ ప్రమాదం లేకుండానే బహుజన దృక్పథం కొనసాగించవచ్చు. ఇంకా కావాలంటే 'మూలవాసి దృక్పథం' దీనికి సరైన విధానం.బ్రాహ్మణ మత గ్రంథాలైన భగవద్గీత ,రామాయణ, మహాభారత ,పురాణ స్మృతి శృతులు ,కంచుకంఠంతో శుద్రులు, అతిశూద్రులు నల్లటి ప్రజలు, ఇండియన్ స్థానిక జాతులని అరుస్తున్నాయి.వేదాలు ,శాస్త్రాలు ఘోషిస్తున్నాయని ఎందుకు చెప్పిన ఇందులో శూద్ర అతిశూద్ర కులాలు/ జాతుల మూలాల చరిత్ర ఉంది.

ఒరిస్సా ప్రాంతాన్ని గౌడ్ లు, కర్ణాటక ప్రాంతాన్ని యాదవులు,సముద్ర ప్రాంతంలో ముదిరాజులు అనేక రాజ్యాలను పాలించారనేది చారిత్రక సత్యం.మాదిగ కులానికి చెందిన జాంబవంతుడు మొదట భారత పాలకుడని ఇటు పురాణాలు అటు చారిత్రక ఆధారాలు నిరూపిస్తున్నాయి. "శూద్రశ్చ అవివరశ్చ,వృషాలశ్చ,జఘనాంగ జన్యశ్చ" వంటి శ్లోకాలు శూద్ర, అతిశూద్ర జాతుల కూటమిలోని ఏకరూపత ,చారిత్రక పునాదిలోనే సామ్యతలను నిర్ధారిస్తున్నాయి.ఇటీవల వివిధ యూనివర్సిటీలు చేసిన పరిశోధనాల్లో ఈ దేశంలోని ఎస్సీ, బీసీలు అత్యంత ప్రాచీన జాతులని, ప్రపంచంలోనే అనేక దేశాల్లోని ప్రాచీన జాతుల వంటివని నిరూపించబడింది. ఇది ఆధునిక కాలంలో పూలే ప్రవచించాడు. కెరియర్ ఇదే దృక్పథంలో జీవితాంతం పనిచేశాడు.ఈ సంగతులను ప్రచారం చేయడం మూలాన ఈ జాతుల మధ్య వైరుధ్యాలు బ్రాహ్మణవాదుల కుట్రేనని గ్రహించే విధంగా చేయగలిగి సమన్వయం సాధించడం అవసరం.

కుల సంఘాలు తమ కర్తవ్యాన్ని మరచి మనువాద పార్టీల వద్ద దళారుల పాత్ర పోషిస్తున్నాయి.ఇది బహుజన ప్రజల వ్యతిరేక విధానమే కాక ద్రోహం కూడాను. తమ బతుకు తెరువు కోసం జాతి ప్రయోజనాలను తాకట్టు పెట్టడం క్షమించరాని నేరం. ఉద్యమ నాయకత్వ అవగాహనరాహిత్యం రాజ్యాధికారానికి మరింత దూరంగా నెట్టి వేస్తున్న దుస్థితి. పాలీష్డు నాయకత్వాన్ని ఇటు ఎస్సీ లోను, అటు బీసీ కులాల్లోనూ రూపొందించాల్సి ఉంది. ఇది విద్యావేత్తల ప్రథమ కర్తవ్యం. ఈ దిశగా బాంబ్స్ ఇవ్వండి సంస్థలు పనిచేయగలుగుతున్న ఇది అణగారిన, బాధిత కులస్తులందరి బాధ్యత, అనివార్యం కూడాను.

ఎస్సీల్లో మాదిగల సమస్య. జనాభాలో గణనీయంగా ఉన్న మాదిగలు రిజర్వేషన్ల లబ్ధిలో మిక్కిలి వెనుకపడ్డారనే నేపథ్యంతో మాల మాదిగలు మరియు ఉప కులాలు తమ జనాభా దామాషా పద్ధతిన రిజర్వేషన్లు పొందేందుకు అనుగుణంగా తమను ఏ.బి.సి.డి లుగా వర్గీకరించాలని పోరాటం. నిజానికి ఇది న్యాయం. అంతేకాదు చాలా చిన్న సమస్య. ఈ సమస్యను అడ్డుపెట్టుకొని మనువాద పార్టీలు ఎంత లబ్ధి పొందాలో పొందినది వాస్తవం. ఈ దరిమిలా మాదిగలు బ్రాహ్మణ శక్తుల కుట్రలను పసిగట్టి ఎండగట్టడంలో విఫలమయ్యారు. వర్గీకరణ లాంటి తాత్కాలిక సమస్యతో పాటు రాజ్యాధికారం వంటి శాశ్వత పరిష్కార మార్గాలపైన దృష్టి సారించాల్సిన తరణం అసన్నమైనది. ఎ.బి.సి.డి లుగా వర్గీకరించిన ఏదో ఒక గ్రూపులోని మరో కులం మళ్ళీ అన్యాయానికి గురైన మని నేపంతో మరో పోరాటం అవసరమవుతుందేమో ?! ఇలాంటి సమస్యనే బీసీలు ఎదుర్కొంటున్న విషయం పరిశీలనార్హం.

బీసిలో వర్గీకరణ ఉంది. అయినప్పటికీ కొన్ని అత్యంత వెనుకబడిన కులాలు తమను ఎంబీసీలుగా గుర్తించాలని, ఉమ్మడి రిజర్వేషన్ల ద్వారా ఎదురవుతున్న సమస్యలను ఏకరువు పెడుతున్నారు.  కొప్పు వేద్దామనుకుంటే జుట్టులేక, జుట్టుంటే కొప్పు వేయరాక దిక్కు తోచని తీరు. ఇలాంటి సమస్యలే ఎస్సీ లోను, బీసీ లోను అనైక్యతకు దారితీస్తున్నాయి. వీటన్నిటికీ మాస్టర్ కినే శాశ్వత పరిష్కారమైనప్పటికీ తాత్కాలిక ఉపశమనం /మార్గమూ ఉన్నది. విద్యా,ఉద్యోగ రంగాల్లో అత్యంత వెనుకబడిన ఎస్సీ ,బీసీ కులాలకు ప్రత్యేక పథకాల ద్వారా (కార్పొరేషన్ ఏర్పాటు, ప్రత్యేక ఉద్యోగ సదుపాయాలు, విద్యావకాశాలు) అభివృద్ధి సాధించేందుకు అభివృద్ధి చెందిన కులాల మేధావి వర్గం ప్రయత్నించాలి. ఇది ఇట్లుంటే రాజకీయ రంగంలో బీసీలకు ప్రాతినిధ్యం లేనేలేదు.

ఎస్సీ లో ఉన్న చట్టసభల్లో కాలుమోపిని ఎస్సీ కులాల జాబితానే ఎక్కువ. వీటి పరిష్కారాల కోసం వివిధ దేశాల్లో వివిధ పద్ధతులు పాటిస్తున్నారు. దానినే దామాషా "ప్రాతినిధ్య విధానం" (పి ,ఆర్ ,సిస్టం) అంటారు. కొన్ని దేశాల్లో అత్యంత తక్కువ జనాభా ఉన్న తెగలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ విధానం ఉపకరించింది.అంటే ప్రతి లక్ష మంది జనాభా ఉన్న కులానికి చట్టసభల్లో ప్రాతినిధ్యం వంటి విధానమే అన్ని కులాల సమస్యలకు పరిష్కారం. ఇది ఐక్యత, ఓర్పు, అంకితభావం ఉన్నప్పుడే సాధ్యం. సోదర కులాల పట్ల అభిమానం ,గౌరవం మరింత ప్రయోజనకరం. ఇక ప్రధాన సమస్య. ఎస్సీలు నాయకత్వం వహించాలా ? బీసీలా ? రాజ్యాధికారంలో పరస్పర అవసరం ఎంత ? ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ రాష్ట్రమైన ఎస్సీల జనాభా 18 నుండి 22 శాతం వరకు ఉంటుంది.ఇందులో వివిధ పార్టీల్లో ఇప్పటికే పీకల వరకు ఇరుక్కుపోయిన వారి శాతం 10 నుండి 12 వరకు ఉంటుంది. ఇక మిగిలింది ఆరు శాతం. ఈ ఆరు శాతానికి 90 సిద్ధాంతాలు, మూడు కొట్లాటలు, ఆరు విభజనలు . ఇలా కాకపోయినా 18 శాతం ఒకటిగా ఉన్నా స్వతంత్రంగా ప్రభుత్వ ఏర్పాటుకు 30 శాతానికి పైగా ఓటు బ్యాంకు కావాలి.

బీసీల జనాభా 50 శాతానికి తక్కువ ఎక్కడా లేదు. బీసీ ఓటర్ల పరిస్థితి అంతే.ఒకవేళ బీసీలు ఒక్కటిగా ఉండగలిగితే 30 శాతం ఓట్ల సాధన సులభమే. అలాంటప్పుడు స్వతంత్రంగా రాజ్యాధికారం సాధ్యమే. కానీ ఆ పరిస్థితి కనిపించడం లేదు. అందుచేత ఎస్సి లోని కనీసం 10 శాతం సమీకరించుకోగలిగితే తిరుగులేదు. ఇంకో విషయం ఏమంటే కేరళ, తమిళనాడులో గౌడులు ఎస్సీలుగా, రజకులు 18 రాష్ట్రాల్లో ఎస్సీలుగా, వడ్డెరలు కర్ణాటకలో ఎస్టీలుగా, ముదిరాజ్ లు,బెస్తలు కొన్ని రాష్ట్రాల్లో ఎస్సీ, ఎస్టీలుగా చలామణిలో ఉన్నారని విషయం బహుజనుల మూలాలు ఒకటేనని ప్రకటిస్తుంది. ఇక బీసీల్లో బీసీలు, ఎంబీసీలు విడిపోతే మరింత అగ్రకులాలు ఆయువు పట్టు పొందినట్టే. కాబట్టి ఎస్సీలకు బీసీల అవసరం అలాగే బీసీలకు ఎస్సీ ,ఎస్టీల అవసరం చాలా ఉన్నది. 1935 లో భారత ప్రభుత్వ చట్ట రూపకల్పన సందర్భంలో 1950 భారత రాజ్యాంగ పరిషత్ ఎన్నికల విషయంలోనూ బీసీల అనైక్యత వల్లే రాజకీయ బానిసలుగా మారిపోయారు.70 సంవత్సరాలు గడిచిన చట్టసభల్లో బీసీ ప్రాతినిధ్యం అందని ద్రాక్ష చందంగా మారింది.రాజ్యాంగ పరిషత్ లో ఒక బీసీ సభ్యుడు కూడా లేకపోవడం దేన్నీ సూచిస్తుంది .?

బీసీలపై ఎస్సీ, ఎస్టి అత్యాచార నిరోధక కేసుల సంఖ్య గణనీయంగానే ఉంది. పరస్పర విద్వేషాలకు కారణాలు అవగాహనరాహిత్యమే. బ్రాహ్మణ వాదాన్ని భుజాలపై ఊరేగించడమే.ఇలాంటి విషాదకరమైన ఘటనాలు పునరావృతం కాకూడదంటే ఏ కులంలోని మేధావి వర్గం, ఆ కులంలో సామాజిక అవగాహన, రాజ్యాధికారం పట్ల కాంక్ష పై బహుళ ప్రచారం చేయాలి. చైతన్యవంతులైన ప్రజలు కలహించుకోజాలరు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్లు "రెండు జాతుల మధ్య సంఘర్షణ ఒక జాతికి విజయాన్నిస్తుంది. ఒకే జాతిలో సంఘర్షణ ఆ జాతిని తుదమ్ముట్టిస్తుంది".ఒక జాతి కుల అస్తిత్వాన్ని ఇంకో కులం గౌరవించి ఆమోదించగలిగితే అసలు సమస్య ఉండదు. దీనికి సైదాంతిక స్పష్టత లేదు చాలా అవసరం. కులాల వారీగా విద్వేషాలు సృష్టించుకోవడం, విడిపోవడం ఉద్యోగులు, విద్యావేత్తల్లోనే ఎక్కువగా ఉన్నది. విపరీతంగా పెరిగిపోయి అగ్రకులాలకు మద్దతుగా నిలవడానికి పోటీపడుతున్నారు. ఇది దురదృష్టకర పరిణామం. ఈ సెక్షన్లోనే ప్రధమంగా అవగాహన కల్పనకు కృషి చేయాలి. చరిత్ర పట్ల అవగాహన కల్పించగలిగితే ఐక్యత, తద్వారా అధికారం సులభ సాధ్యం. ఎస్సీ ,ఎస్టీ ,బీసీల అసలు సమస్య పేదరికం కానే కాదు. అధికారం, స్వయంగౌరవం అసలు సమస్య. దీన్ని మౌలికంగా గుర్తించని వర్గాలు అసత్యాలను ప్రచారం చేస్తున్నాయి.

ఇది వేల సంవత్సరాల క్రితం బీజాలు వేసుకుంది. స్వయంగౌరవం లేని జాతులు బానిసలుగా మారుతారని చరిత్రకారుల భాష్యం నిజమే. ఇది కోల్పోవడం వల్లే బహుజనులు బానిసత్వానికే మొగ్గుచూపుతున్నారు. పెరియార్ ఈ దృష్ట్యా తన ఉద్యమానికి "స్వయం గౌరవ ఉద్యమం "గా పేరు పెట్టారు. స్వయం గౌరవం ఉన్న ప్రజలు మానవ హక్కుల గురించి ఆలోచిస్తారు. పెత్తందారుల, అగ్రకులాల ఆధిపత్యంపై తిరగబడతారు. పెరియార్ ఇదే దృక్పథం కుల నిర్మూలనకు దోహదకారి కాగలదని భావించాడు.కూలి తన ప్రతి బోధనలోను అణగారిన వర్గాల ప్రజల్లో ఆత్మ న్యూనతా భావాన్ని పోగొట్టేందుకే ప్రయత్నించాడు. అందులో భాగంగానే బలిచక్రవర్తిని చరిత్రలోంచి వెలికి తీశాడు. బ్రాహ్మణ కులాల దాడుల చరిత్రను ఆవలోకించి స్పష్టమైన దృక్పథాన్ని అందించాడు,చారిత్రక రంగాల్లోని గజిబిజిని చేదించి బహుజన దృష్టి కోణాల్లో మొత్తం వ్యవస్థను నిర్వహించాడు.

ఇదే మూలవాసి దృక్పథాన్ని హైదరాబాద్ సంస్థానంలో భాగ్యరెడ్డి వర్మ,మద్రాస్ ప్రెసిడెంట్ లోని ఆంధ్ర ప్రాంతంలో త్రిపురనేని రామస్వామి ప్రచారం చేశారు. చివరగా స్వతంత్ర, పాలిష్డ్ నాయకత్వాన్ని బహుజన పితామహుల సైతాంతిక పునాదుల వెలుగులో నిర్మించుకోగలిగినప్పుడు రాజ్యాధికారం వస్తుంది, నిలుస్తుంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నట్లు సాంస్కృతిక విప్లవం రాజకీయ విప్లవానికి, రాజకీయ విప్లవం సామాజిక,ఆర్థిక విప్లవానికి దారితీసి సమ సమాజం స్థాపించబడాలి. అప్పుడే ఈ బానిస కులాలకు విముక్తి. ఇది ఎస్సీ, ఎస్టీ, బీసీ కులాల్లోని విద్యావేత్తలు ,విద్యార్థులు మేధావులు ,నాయకుల కర్తవ్యం.

(డాక్టర్ కదిరె కృష్ణ గారి బహుజన వ్యాసాల నుండి సేకరించబడింది).

[zombify_post]

Report

What do you think?

Written by Narra Paramesh

పాలకుర్తి పౌరుషం ఐలమ్మ

అనకాపల్లి జిల్లాలో పోలీసు యాక్ట్ అమలు. ఎస్పీ కెవి.మురళీకృష్ణ