in ,

ప్రధాని మోడీ ఎస్​పీజీ డైరెక్టర్​ మృతి..

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్ (ఎస్పీజీ)చీఫ్అరుణ్ కుమార్సిన్హా(61) సెప్టెంబర్ 6న మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..

ప్రధాని మోడీ భద్రతా దళమైన ఎస్ పీజీకి సిన్హా డైరెక్టర్గా ఉన్నారు. క్యాన్సర్తో బాధపడుతున్న ఆయన హరియాణా రాష్ట్రం గురుగ్రామ్లోని ఓ ప్రయివేటు ఆసుపత్రిలో చేరారు. పరిస్థితి విషమించి చికిత్స పొందుతూ మృతి చెందారు. 2016నుంచి ఆయన ఎస్పీజీలో పని చేస్తున్నారు. పీఎం నరేంద్ర మోడీతోపాటు చాలా మంది మాజీ ప్రధానుల ప్రొటెక్షన్ లో ఆయన పని చేశారు. సిన్హా 1987 బ్యాచ్ కేరళ కేడర్ ఐపీఎస్ అధికారు. ఇటీవలే ఆయన సర్వీసును పొడగించినట్లు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ లోపే ఆయన మృతి చెందడం విషాదాన్ని నింపింది.

[zombify_post]

Report

What do you think?

Written by Allagadda CM news

నెల్లిమర్ల చంపావతి నదిలో మృతదేహం

విక్రమ్‌ ల్యాండర్‌ను క్లిక్‌మనిపించిన నాసా ఉపగ్రహం..