న్యాయం కోసం ఎంతటి పోరాటానికైనా సిద్దమని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు,కొత్తపేట నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు సత్యానందరావు అన్నారు.చంద్రబాబునాయుడి అక్రమ అరెస్టుకు నిరసనగా రావులపాలెం పార్టీ కార్యాలయం వద్ద తొమ్మిదవ రోజు తెలుగు యువత జిల్లా అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు ఆద్వర్యంలో రిలే నిరాహారదీక్ష చేపట్టారు.అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ టిడిపి ఇంఛార్జ్ గంటి హరీష్ మాధూర్,వాసిరెడ్డి రాంబాబు,ఆకుల రాంబాబు పాల్గొన్న ఈ కార్యక్రమంలో సత్యానందరావు మాట్లాడుతూ జగన్ అరాచక పాలనను యువత ధైర్యంగా ఎదుర్కోవాలని అన్నారు.లోకేష్ యువగళం పాదయాత్రతో జగన్ లో వణుకు పుట్టిందని,ప్రజాదరణ పొందుతున్న పాదయాత్రను అడ్డుకోవడం కోసమే జగన్ కుట్ర రాజకీయాలు చేసి చంద్రబాబును అక్రమ అరెస్టు చేశారని తెలిపారు.ఎన్ని కుట్రలు చేసినా యువతంతా తెలుగుదేశం పార్టీ విజయం చేకూర్చటానికి సిద్దంగా వున్నారని అన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!
 
					 
			
			