44వ డివిజన్లో అభివృద్ధి పనులు ప్రారంభం
విజయనగరంలోని 44వ డివిజన్లో అభివృద్ధి పనులకు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్ర స్వామి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు జరిపారు. బుధవారం ఆ డివిజన్లోని సుందరయ్య కాలనీ, చెంచుల కాలనీలలో సిసి రహదారులు, కల్వర్టులను ప్రారంభించారు. అనంతరం ఎస్ కే డిగ్రీ కాలేజ్ సమీపంలో సిసి రహదారికి శంకుస్థాపన చేశారు. 48. 10 లక్షల రూపాయలతో చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి పనులు పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.
[zombify_post]

