అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ వనుము చిట్టబ్బాయి తెలిపారు. 2023–24కు సంబంధించి కామర్స్, హిస్టరీ, కంప్యూటర్ సైన్స్, కంప్యూటర్ అప్లికేషన్, లైబ్రేరియన్, ఫిజికల్ డైరెక్టర్, హర్టికల్చర్, తెలుగు సబ్జెక్టులకు సంబంధించి ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు ఆయా సబ్జెక్టుల్లో 55శాతం మార్కులతో పీజీ ఉండాలన్నారు.ఎంఫిల్, పీహెచ్డీ, నెట్సెట్ అభ్యర్థులకు తొలి ప్రాధాన్యం ఉంటుందున్నారు. ఈ పోస్టుల్లో చేరేందుకు ఆసక్తి గల అర్హులైన అభ్యర్థులు ఈనెల 15వతేదీ లోగా కళాశాలకు అందజేయాలని ఆయన సూచించారు
[zombify_post]

