ఐసిడిఎస్ శాఖ నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న డిఐఒ.
పార్వతీపురం మండలం పట్టణ, గ్రామీణ అంగన్వాడీ సిబ్బందికి జిల్లా కార్యాలయాల సమావేశ భవనంలో గురువారం ఐసిడిఎస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి (డిఐఒ) డాక్టర్ టి. జగన్మోహనరావు పాల్గొని సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఐదేళ్ళలోపు పిల్లల ఆరోగ్య శ్రేయస్సు కై ఐసిడిఎస్, వైద్య శాఖల సిబ్బంది సమిష్టి కృషి అవసరమని, పిల్లల ఆరోగ్యానికి ప్రభుత్వం అమలు చేస్తున్న అన్ని సేవలు పూర్తి స్థాయిలో అందజేయాలన్నారు.
[zombify_post]

