ఏపీలో రేపటి నుంచి ఐసెట్ కౌన్సెలింగ్.
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు నిర్వహించే ఐసెట్ కౌన్సెలింగ్ను ఈ నెల 8 నుంచి నిర్వహించనున్నట్లు కన్వీనర్ రామమోహన్రావు తెలిపారు. రిజిస్ట్రేషన్లు 8-14, ధ్రువపత్రాల పరిశీలన 9-16, ప్రత్యేక కేటగిరి అర్హత పత్రాల పరిశీలన 12న ఉంటాయని పేర్కొన్నారు. వెబ్ ఆప్షన్ నమోదుకు 19 నుంచి 21 వరకు అవకాశం కల్పించారు. 25న సీట్ల కేటాయింపు జరుగుతుంది. 26న రిపోర్టింగ్, 27 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి.
[zombify_post]

