డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా :
రావులపాలెం మండలం ఈతకోట గ్రామ మాజీ సర్పంచ్ మాధవరపు రామ వెంకట సత్యసాయిబాబా టీడీపీని వీడి ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి సమక్షంలో వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరారు.ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కుల, మత, పార్టీ, వర్గ భేదాలు చూడకుండా అందిస్తున్న సంక్షేమాభి వృద్ధి పాలనకు ఆకర్షితులై వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టు ఆయన ప్రకటించారు.పార్టీలో చేరిన ఆయనను పార్టీ కండువా కప్పి ప్రభుత్వ విప్ చిర్ల సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు
[zombify_post]


