- #హోంమంత్రి డా.#తానేటి_వనిత*
ప్రజారోగ్యానికి పెద్ద పీట వేస్తూ జగనన్న ఆరోగ్య సురక్ష పధకం ద్వారా ప్రజలందరికి ఆరోగ్య పరీక్షలు చేయడం, ఉచితంగా మందులు అందచేయడంతో పాటు అవసరమైన వారికి తదుపరి పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందిస్తున్నామని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ప్రభుత్వం అంటే ప్రజలకు సేవ చేయడం అనేది కేవలం నినాదం మాత్రమే కాదని, అది ప్రభుత్వ విధానమన్నారు. బుధవారం కొవ్వూరు మున్సిపల్ కార్యాలయం, కొవ్వూరు మండలం చిడిపి గ్రామాల్లో నిర్వహించిన జగనన్న ఆరోగ్య సురక్ష క్యాంపులకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ప్రతి స్టాల్ ను పరిశీలించారు, అలాగే స్టాలలోని వైద్యులతో, సిబ్బందితో అక్కడికి విచ్చేసిన రోగులతో వివరాలు అడిగి తెలుసుకొని కొన్ని సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రతి ఇంటిని జల్లెడ పడుతూ ప్రజల ఆరోగ్య సమస్యలను క్షేత్రస్థాయిలోనే గుర్తించి, ఒక్క రూపాయి కూడా ఆర్థిక భారం లేకుండా పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎవరికి ఆలోచన లేనివిధంగా ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆలోచనల మేరకు వైద్య ఆరోగ్య రంగానికి అధిక ప్రాధాన్యతనిస్తూ రాష్ట్రవ్యాప్తంగా జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ వాలంటీర్లు, ఏఎన్ఎంలు, గృహసారథులు, వారందరూ కూడా గత 15 రోజుల నుండి ప్రతి గడపకు వెళ్లి వారి సమస్యలను తెలుసుకొని అక్కడే వారి ఇంటి వద్దనే బ్లడ్ ప్రెషర్, షుగర్ లను పరీక్షించి అక్కడే వారికి టోకెన్ ఇవ్వడం జరిగిందన్నారు. ఆయా ప్రాంతాలకు సంబంధించి మరి ఎక్కడైనా అర్బన్ హెల్త్ సెంటర్ ఉందో ఆ అర్బన్ హెల్త్ సెంటర్ ప్రాంతంలో ఈరోజు జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరాన్ని నిర్వహించడం జరుగుతోందన్నారు. గత 15 రోజులు నుండి సర్వే చేసి తిరిగిన ప్రాంతాల వాళ్ళందరికీ కూడా జగనన్న ఆరోగ్య సురక్ష శిబిరంలో స్పెషలిస్ట్ డాక్టర్లతో వైద్య పరీక్షలు చేయడం జరిగిందని అన్నారు. మహిళలకు సంబంధించి గైనకాలజిస్టులు, ఆర్థోపెడిక్ డాక్టర్లు, చిన్నపిల్లల నిపుణులు, కంటికి సంబంధించి, ఇతర డాక్టర్లు కూడా ఉన్నారన్నారు. ఈ శిబిరంలో వారి వారికి సంబంధించిన 11 రకాల పరీక్షలను కూడా వారికి నిర్వహించడం జరుగుతుందని అన్నారు. అవసరాన్ని బట్టి వారికి అన్ని పరీక్షలు ఇక్కడే నిర్వహించి వారికి తగు వైద్యం అందిస్తూ ఉచితంగా మందులు కూడా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. అలాగే వారికి ప్రతి నెల కు సంబంధించి మందులు ఉంటాయని రాబోవు రోజుల్లో కూడా ఈ అర్బన్ హెల్త్ సెంటర్ ద్వారా అందించాలనే ఆలోచనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమం ఎంతో బృహత్తరమైన కార్యక్రమమని అన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. వాలంటీర్లు ఏఎన్ఎంలు మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు మీరు లేని పక్షంలో, మీరు మీ ప్రాంతంలోని అర్బన్ హెల్త్ సెంటర్ కు శిబిరం జరుగు సమయంలో నేరుగా వచ్చి పరీక్షలు చేయించుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ శిబిరంలో అనేక రకాల కౌంటర్లు కూడా ఏర్పాటు చేయడం జరిగిందని హెల్ప్ డెస్క్, స్పాట్ కౌంటర్, వివిధ పరీక్షలు కూడా ఇక్కడే నిర్వహించడం జరుగుతుందని, ఈసీజీ, రక్త పరీక్షలు అన్ని రకాల పరీక్షలు చేయడంతో పాటు పెద్ద ఆసుపత్రులకు కూడా రెఫర్ కూడా ఇక్కడి నుండే చేయడం జరుగుతుందని అన్నారు. అందుకు సంబంధించి కూడా ఇక్కడ ఆరోగ్య మిత్ర డెస్క్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఆ డెస్క్ ద్వారా రాబోవు రోజుల్లో కూడా వారికి ఏదైనా మెరుగైన వైద్యం అందించాలని ఆరోగ్యశ్రీలో చేయించేందుకు ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కౌంటర్ తెలియజేస్తారని అన్నారు. రాష్ట్రంలో ఉండే పేద నిరుపేదలందరికీ కూడా మెరుగైన వైద్యం అందించాలని వారి యొక్క ఆరోగ్య సురక్ష ఈ ప్రభుత్వం యొక్క బాధ్యత అని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక చక్కటి కార్యక్రమాన్ని దేశం లో ఏ రాష్ట్రం చేపట్టలేని విధంగా మన రాష్ట్రంలో ప్రారంభించడం ఎంతో గర్వకారణంగా ఉందని హోంమంత్రి తానేటి వనిత ఆనందం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులతో పాటు చిన్నపిల్లలకు గుండె ఆపరేషన్ వైద్య నిపుణులు, ఇతర వ్యాధులకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు, ఆశా వర్కర్లు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.
This post was created with our nice and easy submission form. Create your post!