చోడవరం లో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం చోడవరం మండలం లోని గోవాడ స్టేట్ బ్యాంక్ ఎదుట నిలిపిన ఆటోను విద్యుత్ శాఖకు చెందిన వాహనం బలంగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. అలాగే బ్యాంకు వద్ద నిలిపిన పలు ద్విచక్ర వాహనాలు నుజ్జునుజ్జు అయ్యాయి. ఈ ప్రమాదానికి వాహన డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
[zombify_post]


