in , ,

అధికార పార్టీకి చెందిన జడ్పిటిసీ పై గ్రామస్తుల దాడి, తీవ్ర గాయాలు

అల్లూరి జిల్లా కొయ్యూరు మండలం జడ్పిటిసి వారా నూకరాజు పై చటర్జీ పురం గ్రామానికి చెందిన వారు దాడి చేయడం జరిగింది. గ్రామంలో భూ వివాదంపై గత కొన్ని రోజుల నుంచి జడ్పిటిసి కుటుంబ సభ్యులకు, గ్రామస్తులకు వివాదాల జరుగుతున్నాయి.. ఈ సందర్భంలో బుధవారం వారా నూకరాజు కుటుంబ సభ్యులు భూమిలో ఘర్షణ పడుతుండగా పలువురు జడ్పిటిసి పై కర్రలతో దాడి చేశారు. అయితే దాడిలో జడ్పీటీసీ నూకరాజు  త్రివంగా గాయపడడంతో డౌనురు హాస్పిటల్ తరలించి వైద్యం చేస్తున్నారు.అలాగే ఈ దాడిలో ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయాలు కాగా వారిని కూడా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. మరికొంత సమాచారం తెలియాల్సివుంది. 

[zombify_post]

Report

What do you think?

Written by N.Chiranjeevi

విజయదశమి నుంచి విశాఖపట్నం పరిపాలన: సీఎం జగన్

విద్యార్థులకు జుట్టు కత్తిరించిన హెడ్ మాస్టర్.