in ,

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న 35వ వార్డ్ వైసిపి కౌన్సిలర్.

స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొన్న వైసిపి కర్నూలు జిల్లా కార్యదర్శి.. వెల్లాల మధుసూదన శర్మ

స్వచ్ఛభారత్ కార్యక్రమము ప్రారంభించి 9సంవత్సరాలు పూర్తి చేసుకుని పదవ సంవత్సరము మొదలవుతున్న సందర్భంగా ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు ఆదోని మున్సిపల్ 35వ వార్డు పంజరాపోల్ కాలనీ వైసిపి జిల్లా కార్యదర్శి వెల్లాల మధుసూదన శర్మ ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో వైఎస్సార్ పార్టీ నాయకులు, కాలనీ మహిళలు, యువకులు పాల్గొని శ్రమదానం చేసిన అనంతరం ఇంటింటికీ వెళ్లి స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని గురించి మహిళలకు వివరించడం జరిగింది. ఈ కార్యక్రమములో మున్సిపల్ శానిటేషన్ సూపర్ వైజర్ శివ, సచివాలయం శానిటరీ సెక్రటరీలు శ్రీనివాస్,హరి, తో పాటుగా వైసిపి నాయకులు కురువ రవికుమార్, అగ్గి రాముడు, సులోచనమ్మ, దీనమ్మ, సుజాతమ్మ, షెక్సావలి, రాము, లక్ష్మన్న, శేఖర్, మొదలైన వారు పాల్గొన్నారు…

This post was created with our nice and easy submission form. Create your post!

Report

What do you think?

Written by G.Raju

స్వచ్ఛ భారత్ సాధించడమే లక్ష్యం వైసీపీ కార్పొరేటర్ ఇమ్రాన్

అక్టోబర్ 1ఆంధ్రరాష్ట్రఅవతరణ స్పూర్తితో రాయలసీమ హక్కులకోసం పోరాటం